కోట,ఉద్యమ వార్త;ఏప్రిల్ 15.
ప్రజా సేవకుడు ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటయోధుడు గూడూరు రాజకీయాల్లో ఒక బలమైన శక్తి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా పట్టాభిషేకం రాష్ట్రవ్యాప్తంగా ఏకధాటిగా హర్షనీయo వ్యక్తం అవుతుందని కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు అన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన సునీల్ అన్నకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటి,విద్యా శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు,నెల్లూరు జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, పనబాక లక్ష్మీ గార్లకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన తెలిపారు,బుధవారం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సునీల్ అన్నను ఎంపిక చేయడం సంతోషదాయకమని కోటేశ్వరరావు అన్నారు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్న,అభ్యర్థులపై విమర్శలు చేయాలన్న, నమ్మినవారికి అండగా నిలవాలన్న, సామాన్యులకు సాయం చేయాలన్న, నియోజకవర్గం అభివృద్ధి చేయాలన్న సునీల్ అన్నకే సాధ్యం, మోములో నవ్వుదనం, మాటలో కమ్మదనం, రాజకీయ చతురత,సునీల్ అన్నకే సాధ్యం అని ఆయన తెలిపారు,కోట మండలం లో సంబరాలు జరుపుకున్నారు.




