udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 11:26 am Digital Edition : UDYAMA VAARTHA

స్వర్గస్థులైన బండి మణియ్య అంత్యక్రియలకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆర్థిక సాయం.

చిట్టమూరు,ఉద్యమ వార్త;ఏప్రిల్ 12.

చిట్టమూరు మండలం ఈశ్వరవాక ఎస్టీ కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన బండి మణియ్య అంత్యక్రియలకు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఆదివారం ఆర్థిక సాయం అందించారు మణియ్య చనిపోయిన విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొన్న గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ వారు వెంటనే స్పందించి ఆ నిరుపేద కుటుంబానికి 5000 రూపాయలు స్థానిక నాయకులు యల్లసిరి నాగార్జున, కృష్ణయ్య చేతుల మీదుగా ఆ కుటుంబానికి అందించడం జరిగింది.వారి కుటుంబానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్థానిక నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.నిరుపేదకి ఆపద అంటే ముందుండే ప్రజా నాయకులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఒక్కరే అని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు..అన్నా ఎస్టీ కాలనీకి చెందిన పేద కుటుంబానికి చెందిన మణియ్య అనారోగ్యంతో ఆదివారం చనిపోయారని తెలుపగానే ప్రియతమ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెంటనే స్పందించి అంత్యక్రియలు జరిపించండి అని ఆర్థిక సాయం అందించి ఆయన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారని చిట్టమూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే పాసిం కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు ఆపద ఎక్కడున్నా అవసరం ఏదైనా నేనున్నానంటూ భరోసా ఇస్తున్న గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు