udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 9:42 am Digital Edition : UDYAMA VAARTHA

రేపు తిన్నెలపూడి పట్టాదారు పాస్ బుక్ పంపిణీలో-పాసిం సునీల్ కుమార్

కోట ఉద్యమ వార్త మార్చి 8.

మన గూడూరు మన సునీల్ కార్యక్రమంలో భాగంగా కోట మండలం తిన్నెలపూడి పంచాయతి లో రేపు అనగా 9వ తేది పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమంలో గూడూరు శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్ పాల్గొంటారని కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా సంక్షేమమే ద్వేయం గా నిరంతరం ప్రజల కోసమే పనిచేసే ప్రజా నాయకులు మా ప్రియతమ నాయకులు సునీల్ కుమార్ అని అమరావతి లో అసంబ్లీ సమావేశాలలో పాల్గొని నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించి తిరిగి నియోజకవర్గ చేరుకొని విశ్రాంతి తీసుకోకుండా ప్రజా క్షేత్రంలో ప్రజల సమస్యలు,సంక్షేమం ద్వేయం గా పనిచేసే ప్రజా నాయకుడు మా ఎమ్మెల్యే అని జలీల్ అహ్మద్ అన్నారు
ఈ కార్యక్రమంలో కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన తెలిపారు.