udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 6:29 am Digital Edition : UDYAMA VAARTHA

రుద్రవరం లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

కోట ఉద్యమ వార్త మార్చి 29.

కోట మండలం రుద్రవరం గ్రామపంచాయతీలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగాఎల్లసిరి కిష్టయ్య మాట్లాడుతూ శుభసూచికమైన పసుపు రంగు జండాతో తెలుగుదేశం పార్టీని నట విఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఎంతో కృషి చేశారని అన్నారు పేదవారికి కూడు, గూడు, గుడ్డ అందించి పేదవారికి ఆరాధ్యదైవం
అయ్యారు అని ఆయన తెలిపారు 2 రూపాయల కి కిలో బియ్యం,స్త్రీలకు సమాన హక్కులు కల్పించారని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ జెండాని సగర్వంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు కలిసి ఎగరవేయడం జరిగినదని ఆయన తెలిపారు.తెలుగుదేశం పార్టీని పటిష్టపరిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఎంతో కష్ట పడ్డారని తెలిపారు చీర వీరాస్వామి ముదిరాజ్ ఎల్లసిరి ముత్యాలయ్య పున్నేపల్లి మల్లికార్జునయాదవ్ మట్టెపు రమణయ్య యాదవ్
ఎల్లసిరి రమణయ్య బట్టా వెంకటేశ్వర్లు యాదవ్ చీర వీరయ్య ముదిరాజ్
నన్నిమేల శ్రీనివాసులు ముదిరాజ్ నన్నిమేల కస్తూరయ్య ముదిరాజ్
ఎల్లసిరి వెంకటయ్య ఎల్లసిరి వెంకటస్వామి.