udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 9:55 am Digital Edition : UDYAMA VAARTHA

మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి 50 వేలు ఆర్థిక సాయం అందించిన పాసిం సునీల్ కుమార్.

గూడూరు ఉద్యమ వార్త మార్చి 01

గూడూరు పట్టణం ఇందిరానగర్ నందు స్వర్గస్తూలైన పార్టీ కార్యకర్త తేరువాయి చంద్రశేఖర్ కుటుంబానికి గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ అందించిన 50 వేల రూపాయల ఆర్ధిక సహాయంను
ఆకుటుంభం సభ్యులకు నాయకులు ఆరికట్ల మస్తాన్ నాయుడు ద్వారా అందించిన స్థానిక బూత్ కన్వీనర్ మురళీ నాయుడు,స్థానిక కార్యకర్తలు తదితరులు ఈ సందర్భంగా మస్తాన్ నాయుడు మాట్లాడుతూ మరోసారి మా ప్రియతమ శాసనసభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారని కార్యకర్తలకు నియోజకవర్గంలో ఎప్పుడూ అండగా ఉంటారని వారికి ఏ సమస్య వచ్చిన ఎంత కష్టమైనా ఆయన వారి కష్టాన్ని సమస్యను తీర్చే వరకు నిద్ర కూడా పోరని ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం నియోజకవర్గం ప్రజల అదృష్టమని కార్యకర్తలకు మనోధైర్యం కలిగించడంలో ఎమ్మెల్యే గారు ముందు ఉంటారని ఆయన అన్నారు ఈ సందర్భంగా మృతి చెందిన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ఆయన అన్నారు.