udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 8:50 pm Digital Edition : UDYAMA VAARTHA

మహేష్ కుటుంబానికి అండగా-శ్రీధర్ రెడ్డి.

కోట ఉద్యమవార్త మార్చి 21.

కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామం నందు వాదనాల మహేష్ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు ఆయన కుటుంబానికి కోట మండల  తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షులు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా గూడూరు నియోజక వర్గం శాసనసభ్యులు డా!! పాశిం సునీల్ కుమార్ సూచనలు మేరకు వాదనాల మహేష్ మరణం విషయాన్ని తెలుసుకున్న కోట మండలం రైతు అధ్యక్షులు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి తిమ్మనాయుడు పాలెం గ్రామంలో ని ఆయన నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులకు కర్మక్రియల ఖర్చుల నిమిత్తం 5000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు అనంతరం వాదనాల మహేష్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళి అర్పించివారి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ మనో ధైర్యాన్ని ఇచ్చారు. అధైర్య పడవద్దని మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను అండగా ఉంటానని ఈ సందర్భంగా మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి వాదనాల మహేష్ కుటుంబానికి భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా వాదనాల మహేష్ కుటుంబ సభ్యులు శాసనసభ్యులు డా!! పాశిం సునీల్ కుమార్ మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట బూత్ కన్వీనర్ మర్రి నాగభూషణం,వాదనాల మహేష్ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు వున్నారు.