udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 4:14 am Digital Edition : UDYAMA VAARTHA

టీడీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన-ఎమ్మెల్యే సునీల్ అన్న కి శుభాకాంక్షలు- ఏఎంసీ చైర్మన్ ప్రమీల,ఎంపీటీసీ దారా సురేష్.

కోట,ఉద్యమ వార్త; ఏప్రిల్ 15.

నూతనంగా టీడీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వాకాడు ఏఎంసీ చైర్మన్ మరియు ప్రమీల మరియు కోట ఎంపీటీసీ దారా సురేష్ తెలిపారు, గూడూరు నియోజకవర్గం ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసే మంచి మనిషి సునీల్ అన్నను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినందుకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరియు యువతలపతి విద్య మరియు ఐటి మంత్రివర్యులు లోకేష్ బాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఏఎంసీ చైర్మన్ ప్రమీల అన్నారు అలాగే రాష్ట్ర పార్టీ కమిటీ ఎంపికలో సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కి,పెద్దలు మునిసిపల్ శాఖ మాత్యులు పొంగూరు నారాయణకి,పెద్దలు దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి కి,పెద్దలు ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ కొండేపాటి గంగా ప్రసాద్ కి,శ్రీ బీదా రవిచంద్ర కి, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి,శ్రీ బీద మస్తాన్ రావు కి, పార్లమెంట్ అధ్యక్షులు శ్రీమతి పనబాక లక్ష్మీ కి ధన్యవాదాలు తెలిపారు.