udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 4:40 am Digital Edition : UDYAMA VAARTHA

టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ కు శుభాకాంక్షలు-కోట మాజీ ఎంపీపీ మాలికల పవన్ కుమార్.

కోట,ఉద్యమ వార్త;ఏప్రిల్ 15.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనముగా ఎంపికైన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు కోట మండల మాజీ ఎంపీపీ మాణికల పవన్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడి పనిచేసే వారికి పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువు చేశారు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న గూడూరు ఎమ్మెల్యే ఆశీస్సులు కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు నిజమైన ప్రజా నాయకుడికి ప్రజాసేవకాడికి దక్కిన గౌరవంగా గూడూరు నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు నిత్యం గూడూరు నియోజకవర్గ ప్రజలతోనే ఉంటూ ప్రజా క్షేమమే ద్వేయంగా పనిచేస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన సునీల్ కుమార్ కి ఇలాంటి పదవులు ఇంకా ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మాణిక్యాల పవన్ కుమార్ తెలిపారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సునీల్ కుమార్ ను ఎంపీలు చేసినందుకు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర యాదవ్ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి గార్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.