udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 12:54 pm Digital Edition : UDYAMA VAARTHA

జగన్ పర్యటన సందర్బంగా ఏర్పాట్ల పరిశీలించిన కాకాణి.

నెల్లూరు,ఉద్యమ వార్త; ఏప్రిల్ 13.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,కావలి నియోజకవర్గం, జువ్వలదిన్నె కు జగన్మోహన్ రెడ్డి రానున్నడంతో మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యులు తలశిల రఘురాంతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన,మాజీ మంత్రి వర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈనెల 15వ తేదీ జువ్వలదిన్నె రానున్నారని తెలియజేసినకాకాణి జువ్వలదిన్నెకు విచ్చేసి ఫిషింగ్ హార్బర్ ను సందర్శించనున్నారని వెల్లడించిన కాకాణి ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 09:45 నిమిషాలకు హెలికాప్టర్ లో జగన్మోహన్ రెడ్డి జువ్వలదిన్నెకు చేరుకుంటారని పేర్కొన్న కాకాణిజగన్మోహన్ రెడ్డి హయాంలోనిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించిన అనంతరం ఉదయం 11 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతుందని వివరించిన కాకాణిజగన్మోహన్ రెడ్డి అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ లో తిరుగు ప్రయాణం అవుతారని తెలియజేసినకాకాణి
జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగాఅవసరమైన హెలిప్యాడ్నిర్మాణం, ముఖాముఖికార్యక్రమం నిర్వహించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లుచేస్తున్నామని చెప్పిన కాకాణి కావలినియోజకవర్గం, మాజీశాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి రాకకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తికావస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన కాకాణి.