udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 1:15 am Digital Edition : UDYAMA VAARTHA

గూడూరులో పెన్షన్ అందించిన డాక్టర్ పాశిం సునీల్ కుమార్.

గూడూరు ఉద్యమ వార్త ఫిబ్రవరి 28

గూడూరు పట్టణం పేదల సేవలో కూటమి ప్రభుత్వం NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం
గాంధీనగర్ నందు పెన్షన్ అందించిన
డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఈ సందర్భంగా
లబ్ధిదారులను కలసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే పెంచిన పెన్షన్ ను అందిస్తుందని తెలిపారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు నుంచి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అదే మా సిద్ధాంతమని నిత్యం ప్రజల్లోనే ఉంటూ గూడూరు నియోజకవర్గంలో ప్రతి పేదవారు సంతోషంగా ఉండాలని తన ధ్యేయమై సునీల్ కుమార్ తెలిపారు గడిచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం నూటికి నూరు శాతం ప్రజల మనల్ని ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఇస్తున్నామని ఒకటో తేదీ సెలవు దినమైనచో ముందు రోజే పెన్షన్ నిరంతరాయంగా ఇస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.