కోట ఉద్యమ వార్త ఏప్రిల్ 1.
కోట మండలంలోని గూడలి లో చీకట్లో నుండి కొత్త వెలుగులోకి తీసుకొచ్చినట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యూనిట్ ఇంచార్జ్ పల్లిమలు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు గోడలలో గూడలిలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యు స్తంభాలు సమస్య వలన గోడలు పురివీధులలో విద్యుత్ లైట్లు లేక చీకట్లో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ సూచనల మేరకు నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి అన్ని వీధులలో కరెంట్ లైన్ ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు గూడలి పురవీధులలో విద్యుత్ దీపాలు లేక రాత్రులు పాములు తదితర విషయ సర్పాల బెడద ఎక్కువగా ఉండేదని ఇప్పుడు ఆ సమస్యను విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో పూర్తి చేశామని ఆయన తెలిపారు తమ గ్రామంలో ఎప్పటినుంచో వీధిలైట్లు లేక అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ వెంకటకృష్ణారెడ్డి చొరవతో తమ గ్రామ సమస్య తీర్చినందుకు వారికి విద్యుత్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని గూడలి ప్రజలు అన్నారు.