udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 1:16 am Digital Edition : UDYAMA VAARTHA

అందరికీ ఆదర్శ ప్రాయుడు బాబూ జగజ్జీవన్ రావు-ఎమ్మెల్యే సునీల్ కుమార్.

గూడూరు పట్టణం ఉద్యమ వార్త ఏప్రిల్ 5.

భారత ఉపరాష్ట్రపతి బాబు జగజ్జీవన్ రావు అందరికీ ఆదర్శ ప్రాయుడు అని గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ అన్నారు ఆదివారం మాజీ భారత ఉప రాష్ట్ర పతి బాబూ జగజ్జీవన్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఆయనను స్మరించుకుంటూ పూలమాల వేసిన ఆయన కి ఘనంగా నివాళులు అర్పించిన డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఉపరాష్ట్రపతిగా సేవలందించిన బాబు జగజ్జీవన్ రావు ఎందరికో ఆదర్శప్రాయుడని దేశానికి ఎంతో సేవ చేసిన ఆయనను ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘన నివాళి అర్పించడం ఎంతో గర్వంగా ఉందని డాక్టర్ పాసిం సునీల్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా దేశమంతా ఆయనకు నివాళులర్పిస్తున్నారని అంతటి మహనీయుడు మన భారత దేశంలో మన భారతీయుడుగా పుట్టడం మన అదృష్టం అని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.