udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 12:52 am Digital Edition : UDYAMA VAARTHA

అందరికీ ఆదర్శప్రాయుడు బాబూ జగజ్జీవన్ రావు-చక్కా సాయి సునీల్.

నెల్లూరు రూరల్ ఉద్యమ వార్త ఏప్రిల్ 5

భారత ఉపరాష్ట్రపతి బాబు జగజ్జీవన్ రావు అందరికీ ఆదర్శ ప్రాయుడు అని నెల్లూరు రూరల్ 28 డివిజన్ కార్పొరేటర్ చెక్కా అహల్య సాయి సునీల్ అన్నారు ఆదివారం మాజీ భారత ఉప రాష్ట్ర పతి బాబూ జగజ్జీవన్ జయంతి సందర్భంగా వేదయపాలెంలో ఆయనను స్మరించుకుంటూ పూలమాల వేసిన ఆయన కి ఘనంగా నివాళులు అర్పించిన 28 డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఉపరాష్ట్రపతిగా సేవలందించిన బాబు జగజ్జీవన్ రావు ఎందరికో ఆదర్శప్రాయుడని దేశానికి ఎంతో సేవ చేసిన ఆయనను ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘన నివాళి అర్పించడం ఎంతో గర్వంగా ఉందని చెక్క సాయి సునీల్ తెలిపారు ఈ సందర్భంగా దేశమంతా ఆయనకు నివాళులర్పిస్తున్నారని అంతటి మహనీయుడు మన భారత దేశంలో మన భారతీయుడుగా పుట్టడం మన అదృష్టం అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జెన్నీ రమణయ్య గారు, 25వ డివిజన్ కార్పొరేటర్ బద్దపూడి గిరి గారు మరియు తదితరులు.